
భారత్లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల జరిమానా…లోక్సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు
లోక్సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు.
అక్రమచొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం. భారత్లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
అక్రమంగా పాస్పోర్టులు, వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్నిఅధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు.
తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించనున్నాయి.