Advertisements

అమరావతిలో 37,702.15 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం

అమరావతిలో 37,702.15 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 45వ సీఆర్డీఏ సమావేశం

17 న జరిగే క్యాబినెట్‌లో ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయన్న మంత్రి నారాయణ

రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలుస్తామని వెల్లడి

అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన 59 టెండర్‌లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటన్నిటినీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. వచ్చే మాసంలో దాదాపు 20 వేల మంది అమరావతి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 45వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సీఆర్డీఏ మరియు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు.

వీటిలో దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేశామని, వీటిని సీఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందడం జరిగిందన్నారు. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం 59 పనుల్లో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ.22,607.11 కోట్లని, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ.15,095.04 కోట్లని ఆయన తెలిపారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని, మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను ఈ నెల 17వ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.

ఇవి కాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసంధానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి 2014-19 మధ్య కాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించడం జరిగిందన్నారు

కేటాయించడం జరిగిందని, ఈ అంశంపై సోమవారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు మంగళవారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రెండు సంస్థలకు స్థలం మార్పుకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు కాల పరిధిని కూడా పొడిగించడం జరిగిందన్నారు.

అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్దికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చవుతుంది, అందుకు రాష్ట్ర ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఏమాత్రము ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా జరుగుతుందన్నారు. రైతుల నుండి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సీఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇవి అన్నీ పోగా ఇంకా సీఆర్డీఏ వద్ద అభివృద్ది చేయబడిన స్థలం దాదాపు 4 వేల ఎకరాలు ఉంటుందన్నారు. ఆ భూమి తనఖా పెట్టడం ద్వారా మరియు వేలం పాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మించడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుండి రూ.15 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా రూ.5 వేల కోట్ల మేర రుణాన్ని తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా దాదాపు రూ.31 వేల కోట్లను సమీకరించడం జరిగిందని, ఆ నిధులతో పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ది పనుల వల్ల భూమి రేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు ఆ భూములను వేలం ద్వారా అమ్మి వచ్చిన సొమ్ముతో అసలు, వడ్డీలను కూడా తీర్చడం జరుగుతుందన్నారు.

వివిధ బ్యాంకుల నుండి సమీకరిస్తున్న రుణాల నుంచే వెచ్చించేందుకు బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లను అమరావతి అభివృద్ధి పనులకు చూపడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకుని దాదాపు 53,500 ఎకరాలు ఉందని, అందులో 30 శాతం వరకూ గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ధి పరచడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Leave a Comment

You May Like This