
ధర్నా చౌక్ వద్దకు భారీగాచేరుకున్న పోలీసులు
విజయవాడ
రాష్ట్రంలోని అంగన్వాడీ కార్య కర్తలు ఛలో విజయవాడ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వేల మంది అంగన్వాడీలు రానున్న నేపథ్యంలో.. సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు