Advertisements

కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు..

కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు..

సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.

▪️రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం.
▪️ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
▪️రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.
▪️ఎస్సీ వర్గీకరణ అంశంపైనా అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం. రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయం.
▪️నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం.
▪️అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం.
▪️పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా.
▪️వైఎస్సార్ జిల్లాకు కడప యాడ్ చేసి.. వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణము. గత ప్రభుత్వ కాలంలో కడప పేరు తొలగింపు.
▪️వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
▪️సిఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు ఆమోదం.

Leave a Comment

You May Like This